రైఫిళ్లలోని బుల్లెట్లపై ఆవు, పంది కొవ్వును వినియోగిస్తున్నారనే సందేశాన్ని భారతీయులకు చేరవేయడానికి చపాతీలను వాడుకున్నారు. చపాతీలను ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి తీసుకువెళ్ళి.. గ్రామ పెద్దకు అప్పగించేవారు. ఇలా మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ నుంచి గ్వాలియర్ వరకు.. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ గుండా రోహిల్ఖండ్కు చపాతీలు చేరుకునేవి. ఒకే రాత్రిలో 160 నుంచి 200 మైళ్ల దూరం ఈ చపాతీలు ప్రయాణించేవి.