1857 మార్చిలో బారక్పోరాకు చెందిన మంగళ్ పాండే క్యాట్రిజ్ను ఉపయోగించేందుకు నిరాకరించాడు. బలవంతం చేసిన అధికారులపై తిరగబడ్డాడు. ఏప్రిల్ 8న మంగళ్ పాండేను ఉరితీశారు. ఇది జరిగిన నెల రోజులకు మీరట్కు చెందిన మరో 85 మంది సైనికులు కొత్త రైఫిల్స్ను వాడమని తేల్చిచెప్పారు. వారికి 10 ఏళ్ల కఠిన జైలు శిక్షపడింది. ఆ తర్వాత ఆ ప్రాంతం జవాన్లు పూర్తిగా తిరగబడ్డారు.