నమీబియా దేశ అధ్యక్షుడు హేజ్ గింగోబ్ (82) క్యాన్సర్ కారణంగా 4-2-2024 మరణించాడు. ఈయన ఆ దేశ రాజధాని విండ్హాక్లోని లేడీ పొహాంబా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష భవనం వెల్లడించింది. 2015 నుంచి గింగోబ్ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన దేశానికి మూడో అధ్యక్షుడిగా పనిచేశారు. దక్షిణాఫ్రికా వలస పాలన నుంచి బయట పడ్డాక ఆ దేశ మొదటి ప్రధానిగా 1990-2002 మధ్య, తిరిగి 2008-2012 మధ్య ఆయన వ్యవహరించారు.