సహాయ శిబిరాల నుంచి ఓటు వేయనున్న 24 వేల మంది

76చూసినవారు
సహాయ శిబిరాల నుంచి ఓటు వేయనున్న 24 వేల మంది
జాతుల మధ్య చెలరేగిన హింస కారణంగా మణిపూర్‌లో సుమారు 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో అత్యధిక ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందారు. సహాయ శిబిరాల్లో ఉన్న సుమారు 24 వేల మందికిపైగా ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. వారి కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిరాశ్రయులు, స్థానభ్రంశం చెందిన వ్యక్తుల కోసం 94 ప్రత్యేక పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్