మధ్యప్రదేశ్లోని గుర్తింపు లేని ఓ అనాథాశ్రమం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. కనిపించకుండా పోయిన ఆ బాలికలు గుజరాత్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.