పని ఒత్తిడితో 26 ఏళ్ల కూతురు మృతి.. EY సంస్థ విధానాలను దుయ్యబట్టిన తల్లి

59చూసినవారు
పని ఒత్తిడితో 26 ఏళ్ల కూతురు మృతి.. EY సంస్థ విధానాలను దుయ్యబట్టిన తల్లి
అన్నాసెబాస్టియన్ అనే 26 ఏళ్ల మహిళకి పుణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సంస్థలో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగంలో చేరిన 4 నెలలకే అన్నా చనిపోవడంతో ఆఫీస్ లో పని ఒత్తిడే కారణంటూ ఆమె తల్లి ఆరోపించింది. దీంతో సంస్థ విధానాలను ఖండిస్తూ అన్నా తల్లి EY ఇండియా బాస్ రాజీవ్ మెమనికి లేఖ రాశారు. కొత్తవారిపై వెన్ను విరిగిపోయేంతా పని భారం మోపడం సరి కాదని లేఖలో పేర్కొంది. ఉద్యోగులతో పగలు, రాత్రి పని చేయించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్