రాజస్థాన్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చురు ప్రాంతంలో మంగళవారం గరిష్ట స్థాయిలో 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు జైపూర్లోని ఐఎండీ సెంటర్ వెల్లడించింది. ఆ తర్వాత గంగానగర్లో 49.4 డిగ్రీలు, ఫలోడి, పిలాని, కరౌలీ ప్రాంతాల్లో 49 డిగ్రీలు, సంగారియాలో 48.4 డిగ్రీలు, ఫతేపూర్, భికనీర్ 48.3 డిగ్రీలు, కోటాలో 48.2 డిగ్రీలు, జైపూర్లో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.