వైసీపీ హయాంలో హేమచంద్రారెడ్డి ఊరు పేరు లేని కంపెనీలతో ఇంటర్న్షిప్ ఒప్పందాలు చేసుకుని, వారికి భారీగా నిధులు సమర్పించారు. రూ.50 కోట్ల ఈ ప్రాజెక్టుకు ఎలాంటి టెండర్లు పిలవలేదు. ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరుతో హైదరాబాద్కు చెందిన బ్లాక్బక్స్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే రూ.51లక్షలు చెల్లించింది.