ఏపీలో టీడీపీ కూటమే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తేల్చింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 98-120 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అధికార వైసీపీ 55-77 స్థానాలతో సరిపెట్టుకోనుందని పేర్కొంది. టీడీపీ: 78-96, జనసేన: 16-18, బీజేపీ: 4-6, కాంగ్రెస్: 0-2 సీట్లలో జయకేతనం ఎగురవేస్తాయని వివరించింది.