దేశంలోని దిగ్గజ ఐటి కంపెనీలు వేలల్లో ఉద్యోగుల కుదింపునకు పాల్పడ్డాయి. ఇటీవల స్టార్టప్ నుంచి పెద్ద కంపెనీల వరకూ తేడా లేకుండా దాదాపు అన్నింటిలోనూ ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. అగ్రశ్రేణి మూడు ఐటి కంపెనీల్లో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 64,000 మంది పైగా సిబ్బందిని కుదించుకున్నాయి. వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ పొదుపు చర్యల్లో భాగంగా తొలగింపులకు పాల్పడటం గమనార్హం.