1300 ఏళ్ల నాటి ఖడ్గం మాయం చేసిన దుండగులు

53చూసినవారు
1300 ఏళ్ల నాటి ఖడ్గం మాయం చేసిన దుండగులు
ఫ్రాన్స్ లోని రోకమడౌర్ లో రాతిలో ఉన్న ఆ ఖడ్గం 1300 ఏళ్ల నాటిది. డురండాల్ కత్తిగా పిలుచుకునే దాన్ని 8వ శతాబ్దంలో రోలాండ్ అనే సేనాధిపతి వాడారట. చనిపోయే ముందు ఆయన కత్తిని విసిరితే వందల మైళ్లు దూరంలోని రోకమడౌర్ లో రాయిలో దిగబడిందనేది స్థానికుల నమ్మిక. పర్యాటక ఆకర్షణగా ఉన్న ఆ కత్తి చోరీకి గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్