ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలుడు మూడేళ్ల పసిబిడ్డను టాయిలెట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మీడియా కథనాల ప్రకారం వెలుగులోకి వచ్చింది. బాలిక అరుపులు విని ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి చూసే సరికి పసికందు తీవ్ర గాయాలపాలై తీవ్ర రక్తస్రావమైంది. చిన్నారి శరీరంపై గాటులున్నట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.