ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ కుప్పకూలి 24 ఏళ్ల యువతి మృతి

52చూసినవారు
ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ కుప్పకూలి 24 ఏళ్ల యువతి మృతి
కొచ్చిలోని జిమ్‌లో 24 ఏళ్ల అరుంధతి అనే యువతి మంగళవారం ఉదయం వ్యాయామం చేస్తుండగా కుప్పకూలి మరణించింది. వాయనాడ్‌కు చెందిన అరుంధతి ఎనిమిది నెలల క్రితమే రాహుల్‌ను వివాహం చేసుకుని కొచ్చికి షిఫ్ట్ అయ్యింది. అరుంధతి ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడింది. జిమ్ సిబ్బంది మరియు ఇతర సభ్యుల నుండి తక్షణ సహాయం లభించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. అరుంధతి మరణంతో ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్