జ్వరం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. జ్వరం వచ్చినప్పుడు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. జ్వరంగా ఉన్నప్పుడు కొన్ని పదార్థాలకు దూరంగా వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. తృణధాన్యాలు వాటి ఉత్పత్తులలో అధిక ఫైబర్ ఉంటుంది కనుక వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పొట్టుతో కూడిన పప్పులు తీసుకోరాదని, క్యాబేజీ, క్యాప్సికమ్, ముల్లంగి, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటిని జ్వరం సమయంలో దూరం పెట్టాలని సూచిస్తున్నారు.