టీడీపీ నేతలకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. అర్హత ఉండి ఇళ్ల స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించినా.. ఎన్నికల్లో పోటీ చేయనని వెల్లడించారు. టీడీపీ హయాంలో గుడివాడ నియోజకవర్గంలో కనీసం ఒక్క ఎకరా కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. పేదల ఇళ్ల స్థలాల అప్పును కేవలం రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్ది అని కొనియాడారు. జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డని అన్నారు.