తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి ఐదు రోజులపాటు వారిని పోలీసులు విచారించనున్నారు. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.