వినాయక చవితి వేళ ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా యనమలకుదురులో అర్జునరావు అనే 61 ఏళ్ల వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్లి మామిడాకులు కోశాడు. అయితే అడగకుండా మామిడాకులు కోయడంతో ఆ ఇంటి యజమాని నాంచారయ్య, అర్జునరావుతో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగింది. ఈ క్రమంలో అర్జునరావుపై నాంచారయ్య కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన అర్జునరావును ఆస్పత్రికి తరలించారు.