కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి బెంగళూరు-మైసూరు వెళ్లే మార్గంలో ట్రక్కును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులను విశ్వ, సూర్యగా గుర్తించారు. వారు మైసూరు నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రాంనగర్ పోలీసులు తెలిపారు.