వరంగల్లో బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని , ధాస్యం వినయ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఏనుగు రాకేష్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులపై గురువారం కేసు నమోదైంది. నిన్న ఖిలావరంగల్లో కాకతీయ కళాతోరణం దగ్గర.. బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారంటూ వారిపై మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి.