దళిత దంపతులను స్తంభానికి కట్టేసి కొట్టారు

85చూసినవారు
దళిత దంపతులను స్తంభానికి కట్టేసి కొట్టారు
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌ జిల్లాలో ఓ దళిత దంపతులను స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు. బాధితుల కుమారుడు ఓ మహిళను వేధించిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆ వృద్ధ దంపతులు ఊరు విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మహిళ భర్త మరో తొమ్మిది మందితో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్