మాదాపూర్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్ అనే వ్యక్తిని టీజీ న్యాబ్, మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చే ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాయిచరణ్తోపాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యంలను అరెస్టు చేశారు.