వినాయకుడి మెడలో రూ.4 లక్షల బంగారు గొలుసు వేసి అలాగే నిమజ్జనం చేశారు

71చూసినవారు
వినాయకుడి మెడలో రూ.4 లక్షల బంగారు గొలుసు వేసి అలాగే నిమజ్జనం చేశారు
వినాయక చవితి సందర్భంగా ఓ జంట చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంట్లో గణపతికి పూజ చేసిన దంపతులు విగ్రహం మెడలో రూ.4 లక్షల విలువైన బంగారు గొలుసును వేశారు. అనంతరం ఆ గొలుసును మరిచిపోయి తీయకుండానే మొబైల్ ట్యాంకులో నిమజ్జనం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని విజయనగర ప్రాంతంలో చోటుచేసుకుంది. చివరకు వారు పోలీసులు, ఎమ్మెల్యేకు విషయం చెప్పగా 10 మందిని ఏర్పాటు చేసి మొబైల్ ట్యాంకులో వెతికించగా చైన్ దొరికింది.

సంబంధిత పోస్ట్