లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అజిత్ పవార్కు ఊరటనిచ్చే కీలక ప్రకటన వెలువడింది. ఎంఎస్సీబీ బ్యాంకుకు సంబంధించిన రూ.25 వేల కోట్ల కుంభకోణం కేసులో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్కు మహారాష్ట్ర పోలీసు ఆర్థిక నేరాల విభాగం బుధవారం క్లీన్ చిట్ ఇచ్చింది.