రైలులో ప్రయాణికుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన టీసీ

57చూసినవారు
బిహార్‌లోని దర్భంగా నుంచి వారణాసికి ట్రైన్ లో వెళ్తుండగా బీపీ కర్ణ అనే వృద్ధుడు గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అతని సోదరుడు ఎమర్జెన్సీ అంటూ రైల్ మదద్ పోర్టల్లో రైల్వే అధికారులకు తెలియజేశాడు. కొద్ది క్షణాల్లోనే రైలులో ఉన్న టీసీ సవింద్ కుమార్ అక్కడికి చేరుకొని వైద్యుల సూచన మేరకు 15 నిమిషాల పాటు సీపీఆర్ చేసి అతడిని కాపాడారు. దీంతో టీసీని సన్మానించి నగదు బహుమతి అందిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్