ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు బీజేపీ అభ్యర్థిగా జహీరాబాద్ నుంచి లోక్సభ బరిలో నిలవనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ కీలక నేతలు త్వరలోనే దిల్ రాజుతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో దిల్ రాజు పోటీపై త్వరలోనే ఓ క్లారిటీ రానున్నట్లు సమాచారం.