పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. సీఎం, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీ చేపట్టిన 25వేల మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. నియామకాల కుంభకోణంపై దర్యాప్తును కొనసాగించుకోవచ్చని సీబీఐకి తెలిపింది. అయితే, దర్యాప్తు సమయంలో నిందితుల అరెస్టు వంటి చర్యలకు దిగవద్దని సూచించింది.