కేరళలో అధికార సీపీఎంకు చెందిన భూమి, బ్యాంకు డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. కరువాన్నూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో హవాలా లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంది. PMLA కింద త్రిసూర్ జిల్లాలో రూ.10 లక్షల విలువైన భూమి, ఐదు గుర్తు తెలియని రూ.63 లక్షల బ్యాంకు డిపాజిట్లను జప్తు చేశామని ఈడీ వర్గాలు తెలిపాయి.