జార్ఖండ్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దీని కోసం కృషి చేస్తానని శపథం చేశారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్, శనివారం రాంచీలో జేఎంఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశంలో సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయడంలో బీజేపీకి నైపుణ్యం ఉందని విమర్శించారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు.