ట్రాక్‌పై గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొన్న రైలు.. పట్టాలు తప్పించే కుట్రగా అనుమానం

73చూసినవారు
ట్రాక్‌పై గ్యాస్‌ సిలిండర్‌ను ఢీకొన్న రైలు.. పట్టాలు తప్పించే కుట్రగా అనుమానం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని ముదేరి గ్రామంలో ఆదివారం రాత్రి రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్ పెట్టారు. గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో రైలు సరిగ్గా అక్కడికొచ్చి దానిని ఢీకొట్టి ఆగింది. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సిలిండర్, పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెలు ఉన్నాయి. కాగా, దీనిని పట్టాలు తప్పించే కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్