కేరళలోని కొచ్చిన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పురుషుడిగా మారిన ట్రాన్స్జెండర్ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ బిడ్డను కనాలని నిర్ణయించుకొని రెనై ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడి వైద్యులు గతంలో భద్రపరిచిన అండాలను, ఓ వీర్యదాత నుంచి సేకరించిన శుక్రకణాలను అతడి భార్య గర్భంలో ప్రవేశపెట్టారు. గత డిసెంబరులో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దేశంలోనే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని రెనై ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు తెలిపారు.