పారిస్ ఒలింపిక్స్ 2024లో అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చిన రెజ్లర్ అమన్ సెహ్రావత్కు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ విమానాశ్రయానికి అభిమానులు భారీగా చేరుకుని స్వాగతం పలికారు. కాంస్య పతక పోరులో సెహ్రావత్.. డారియన్ క్రూజ్ను ఓడించి పతకం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం తరపున అతి చిన్న వయసులో(21 సంవత్సరాల 0 నెలల 24 రోజులు) వ్యక్తిగత పతక విజేతగా నిలిచాడు.