హైదరాబాద్ హబ్సిగూడలో సోమవారం తమ పిల్లలను చంపి చంద్రశేఖర్రెడ్డి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. భార్యా భర్తల మృతదేహాల వద్ద వేరువేరుగా సూసైడ్ నోట్లు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులను భరించలేకే మొదట పిల్లలకు విషమిచ్చి, ఉరేసి, ఆ తరువాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని తెలిసింది. పిల్లల్ని ఏ విధంగా చంపారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.