ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ఆప్ నిర్ణయించింది. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ తరఫున బుధవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఆప్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.