చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలో ఛేజింగ్ సమయంలో అత్యధిక సార్లు నాటౌట్గా నిలిచిన బ్యాటర్గా ధో
నీ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన
మ్యాచ్లో ధోనీ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇప్పటివరకు ధోనీ ఛేజింగ్లో అత్యధికంగా 28 సార్లు అజేయంగా
నిలిచాడు.