ఇటీవల వేటగాళ్ల వలలో పడి ఓ చిరుత మృతి చెందింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దౌల్తాబాద్, చేగుంట సరిహద్దులోని అడవిలో జంతువుల కోసం వేటగాళ్ళు వల ఏర్పాటు చేయగా, దానిలో చిరుత చిక్కింది. వేటగాళ్లు చిరుతను కొట్టి చంపి కళేబరాన్ని దహనం చేశారు. ఈ విషయం గురించి ఫారెస్ట్ అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.