ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పోలవరం పర్యటన ముగిసింది. తొలుత ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతి వివరాలను జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు స్పిల్ వే పనులను ఆయన పరిశీలించారు. పర్యటన అనంతరం పోలవరం నుంచి ఉండవల్లి బయలుదేరారు.