ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని బీచ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్ ఐలాండ్లోని కాపలా లేని బీచ్లో 20 ఏళ్లలో ఇదే తొలి ప్రమాదం అని అధికారులు తెలిపారు. మృతులను జగ్జీత్ సింగ్ ఆనంద్ (23), సుహాని ఆనంద్ (20), కీర్తి బేడీ (20), రీమా సోంధీ (43)గా గుర్తించారు.