నిందితులను ఉరి తీయాలి: ఆకునూరి మురళి

61చూసినవారు
నిందితులను ఉరి తీయాలి: ఆకునూరి మురళి
నారాయణపేట జిల్లా ఊటుకూరు మండలం చిన్నపొర్లలో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ట్విట్టర్ వేదికగా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి స్పందించారు. 'ఇంత దారుణమైన, క్రూరమైన హత్యాకాండ జరుగుతున్న సమాజం‌లో బతుకుతున్నామా అని భయంతో పాటు జుగుప్స పుడుతోంది. సీఎం గారు ఈ ఘటన‌పై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి.. నిందితులను ఉరి తీయండి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుంది. సరైన సమయానికి స్పందించని పోలీసు సిబ్బంది‌ని కూడా అరెస్ట్ చేసి తక్షణమే సర్వీస్ నుంచి తొలగించాలి' అని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్