ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమా మహేశ్వరరావు

80చూసినవారు
ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమా మహేశ్వరరావు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మూడు రోజులపాటు ఉమామహేశ్వరరావును అధికారులు విచారించనున్నారు. బినామీ డాక్యుమెంట్లపై ఆరా తీయనునున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు ఉమామహేశ్వరరావుకు చెందిన రూ.3.95 కోట్ల ఆస్తులను గుర్తించారు.

సంబంధిత పోస్ట్