మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను మాలీ మహాసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో గల పూలే దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవలను గుర్తించి పూలే దంపతులకు భారతరత్న ప్రకటించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే కోరారు.