బేల మండలంలోని మాంగ్రూడ్, ఖోగ్దూర్, శంషాబాద్, కాప్సి, డోప్టాల తో పాటు పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస రెడ్డి, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్ చారి ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోనే సాధ్యమని వారు న్నారు. చేతి గుర్తుకు ఓటేసి పార్టీ అభ్యర్ధి ఆత్రం సుగుణ ను గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు.