న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో సమరసత దివస్

60చూసినవారు
న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో సమరసత దివస్
రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సమరసత దివస్ ను ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ వారు చేసిన త్యాగాలకు మనందరం రుణపడి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బార్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ హాజరై మాట్లాడారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్