సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐ. ఎఫ్. టి. యు జిల్లా అధ్యక్షుడుగౌరాల సుభాష్ ఆ సంఘానికి రాజీనామా చేశారు. ఐ. ఎఫ్. టి. యు తో పాటు సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఆయన తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. ఇన్ని రోజులుగా సహకరించిన సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ, ఐ. ఎఫ్. టియు బాధ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.