పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ రూపాలలో ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో బిజెపి అధికార ప్రతినిధి చిలుకూరి జ్యోతి రెడ్డి నిలువెత్తు అభిమానం చాటుకున్నారు. బిజెపి ప్రచారంలో పాల్గొంటున్న ఆమె కమలం పువ్వు గుర్తు చీర ధరించి ఆకర్షణగా నిలుస్తున్నారు. పార్టీపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.