ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో సొసైటీ కీ సంబదించిన 8 ప్లాట్లలో 2 ప్లాట్లని తప్పుడు ధ్రువ పాత్రలతో కబ్జాలు చేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ డెవలప్ మెంట్ కమిటీ అధ్యక్షులు లోక ప్రవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు దుర్గంశేఖర్ సోమవారం కోరారు. ఈ విషయమై సోమవారం కలేక్టర్ రాజర్షి షా ను కలిసి సమస్యను విన్నవించారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.