ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కావున రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు