రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

2925చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని బాలపూర్ గ్రామం వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి నిలారా గ్రామానికి చెందిన మెస్రం రాజు గా గుర్తించారు. గాయపడ్డ వ్యక్తి ని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ఐతే ప్రమాదం ఎలా జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్