తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ని సవరించి తెలంగాణ ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ గరిష్ట వయోపరిమితిని 44 నుండి 46 వరకు రెండేళ్లు పెంచి నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించిందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ సందర్భాన్ని ఆదిలాబాద్ లో మంగళవారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.