ఆదిలాబాద్ లోని శ్రీనివాస వైన్స్ లో ఈనెల 6న తల్వార్ లతో సిబ్బందీని బెదిరించిన నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం సీఐ అశోక్ తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. షేక్ నౌషద్, లాలు అలియాస్ అతిఫ్ ఉద్దీన్ ఫరూఖ్, షేక్ ఇర్ఫాన్ లను అరెస్ట్ చేయగా, అజ్మత్ ఖురేషి పరారీలో ఉన్నారన్నారు. పోలీస్ సిబ్బంది రమేష్, నరేష్, క్రాంతి లను అభినందించారు