పండగ పూట గర్భిణి మృతిచెందిన విషాద ఘటన జైనూర్ మండలంలోని లక్ష్మణ్ పటేల్గూడలో చోటు చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఆత్రం లక్ష్మి(30) ఎనిమిది నెలల గర్భణి. మంగళవారం ఆమెకు అకస్మాత్తుగా దమ్ము, దగ్గు రావడంతో భర్త ఆనంద్రరావ్ జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిబ్బంది సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.